జూలై 5న థియేటర్ల లో సందడి చేయనున్న‘లోపలికి రా చెప్తా’

కొన్ని సినిమాలు చిన్నగా స్టార్ట్ అయ్యి , పబ్లిసిటీ పరంగా క్యూరియాసిటి పెంచుతూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ దిశగా పయనిస్తాయి. ఆ కోవలోని చిత్రమే” లోపలికి రా చెప్తా”మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నింటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలుపుతూ.. చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్‌గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకుందాం’’ అని అన్నారు.

కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
మ్యూజిక్: దేవ్ జాంద్,
డిఓపి: రేవంత్ లేవాక, అరవింద్ గణేష్,
ఎడిటర్: వంశీ,
పి ఆర్ ఓ: బి. వీరబాబు
ప్రొడ్యూసర్స్: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *