మిస్ వరల్డ్ కంటెస్ట్.. చివరిదశకు చేరుకుంది. ఇది 72వ ఎడిషన్. దాదాపుగా నెలరోజుల పాటు సాగిన ఈ పోటీలకు నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రమే గ్రాండ్ ఫినాలె. హైటెక్స్.. దీనికి వేదిక. మిస్ వరల్డ్ కిరీటం కోసం మొత్తం 108 దేశాలు పోటీపడ్డాయి. వారిలో 40 మంది చివరి రౌండ్ కు చేరుకున్నారు. ఫైనల్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వివాదాస్పద పరిస్థితుల మధ్య మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తప్పుకోవడంతో ఈ సంఖ్య తగ్గింది. ఫైనల్ రౌండ్ కు ఎంపికైన వారిలో మిస్ ఇండియా నందిని గుప్తా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అందరి దృష్టీ ఆమెపైనే నిలిచింది. టాప్ 5లో రాగలుగుతారా? లేదా అనే ఆసక్తి నెలకొంది.
గ్రాండ్ ఫినాలె నేడే.. ఆ అదృష్టవంతురాలు ఎవరో..?
