టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున త్వరలోనే ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ముంబైలో చిత్ర బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“అందరికీ నమస్కారం.. మీరు ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చే ప్రతి సారి చూపించే ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఎయిర్ పోర్ట్ నుంచే మీ అభిమానాన్ని చూశాను. నా కెరీర్ ప్రారంభం నుంచే, ‘శివ’ సహా ఎన్నో సినిమాలకు ఇచ్చిన ఆదరణకు ఎంతో కృతజ్ఞతగా థ్యాంక్స్ చెబుతున్నా” అని నాగార్జున తన మాటలు ప్రారంభించారు.

“ఇప్పటి పరిస్థితుల్లో ‘కుబేర’ సినిమా నా కోసం ప్రత్యేకంగా చెప్పాలి. ఆలోచిస్తూ ఉన్నాను… తర్వాత ఏం చేయాలి? అదే తరహా పాత్రలు మళ్లీ చేయాలనిపించలేదు. అప్పుడు కుబేర ప్రాజెక్ట్ నా వద్దకు వచ్చింది. శేఖర్ కమ్ముల వచ్చి, ‘ఈ పాత్ర చేస్తారా?’ అని అడిగారు. నేను ఏ ఆఫర్ కోసం అడగకుండానే వెంటనే ‘అవును’ అని చెప్పేశాను” అని నాగార్జున చెప్పారు.

“ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలు నేను ఇదివరకే చూసాను. ఆయన ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన కథలు చాలా సెన్సిటివ్గా, హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఆయన మనసు కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. అందుకే ఆయనతో పనిచేయాలనుకున్నాను. ‘కుబేర’ అంగీకరించిన తర్వాత చూస్తే ఇందులో ఒక్కరిద్దరు కాదు… మొత్తం స్టార్ కాస్ట్ ఉంది” అని తెలిపారు.
“జిమ్ సర్బ్తో కలిసి నటించడం చాలా ఆనందంగా, గౌరవంగా అనిపించింది. ఆయన నటన అసాధారణం. ఆయననే నాకు కంటే బెటర్గా తెలుగు డైలాగ్స్ చెప్పేశాడు,” అని అన్నారు నాగార్జున. “రష్మిక టాలెంట్కి పర్యాయపదం. గత మూడేళ్లుగా ఆమె అద్భుతంగా రాణిస్తోంది. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల బడ్జెట్ చిత్రాలు చేయగల టాలెంట్ ఆమెలో ఉంది. మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేస్తోంది. ఆమె నిజంగా బ్రిలియంట్,” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

‘కుబేర’ సినిమా ప్రేక్షకులను నవ్వులతో అలరిస్తుందని చెప్పారు. మూవీలో నలుగురు కొత్త నటులు భాగమయ్యారని, వారు ఎంతో గొప్పగా నటించారని తెలిపారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారని కొనియాడారు. “ఆయన సంగీతం సినిమాకు మంచి బలాన్నిచ్చింది” అని పేర్కొన్నారు.
ధనుష్ గురించి మాట్లాడుతూ, “ఆయన పూర్తిగా టాలెంటెడ్ ఆర్టిస్ట్. తన పాత్రలో పూర్తిగా లీనమైపోతాడు,” అని ప్రశంసించారు. ‘కుబేర’ మూవీ టీమ్తో కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

