అక్కినేని వారింట పెళ్లి సందడి.. సీఎం చంద్రబాబుకి ఆహ్వానం
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి నాగార్జున మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలసి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్డ్డీ కుమార్తె జైనబ్ని అఖిల్ ఈ నెల 6న వివాహం చేసుకోనున్నాడు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వివాహ వేడుక జరగనుండగా, రిసెప్షన్ రాజస్థాన్లో గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున మంగళవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాగార్జున చంద్రబాబును కలిశారు. తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన జుల్ఫీ రవ్డ్డీ కుమార్తె జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం గతేడాది నవంబర్ 26న జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ జంట వివాహం ఈ నెల ఆరో తేదీన జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగార్జున దంపతులు తమ కుమారుడి వివాహానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. పెళ్లి అన్నపూర్ణ స్టుడియోలో జరగనుండగా.. రిసెప్షన్ రాజస్థాన్లో గ్రాండ్గా ప్లాన్ చేశారట.
అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడైన నాగచైతన్యకి హీరోయిన్ శోభితతో వివాహం జరగ్గా… ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ వివాహానికి సినీ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రెటీలతో పాటు రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. అఖిల్కి గతంలో వ్యాపార దిగ్గజం జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్తో నిశ్చితార్థం జరగ్గా.. మనస్పర్థల కారణంగా క్యాన్సిల్ చేసుకున్నారు. కొన్నాళ్లుగా జైనబ్తో ప్రేమాయణం నడుపుతున్న అఖిల్ ఇప్పుడు ఆమెతో పెళ్లి పీటలెక్కుతున్నాడు. అయితే అఖిల్ కంటే జైనబ్ వయసు తొమ్మిదేళ్లు ఎక్కువని తెలుస్తోంది.
