ఈ బైక్‌ని పెట్రోల్‌తో కాదు ఉప్పుతో నడపొచ్చుగా!.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే..?

Bike: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ప్రజలు మెల్లగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్ల నుంచి బైక్‌లు, స్కూటర్ల వరకు అన్నీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తోంది.ఇదిలా ఉంటే ఓ కీలక వార్త బయటకు వచ్చింది. అవును, అది వింటే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు! అదే సాల్టీ స్కూటర్!

నుండి బైక్‌లు , స్కూటర్ల వరకు ప్రతిదీ ఎలక్ట్రిక్ విభాగంలో అందుబాటులో ఉంది. ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగం పెరుగుతోంది.సముద్రపు ఉప్పులో సమృద్ధిగా లభించేదే సోడియం. సోడియంతో తయారు చేయబడిన ఒక రకమైన సాల్ట్ అయాన్ బ్యాటరీతో నడిచే బైక్ మార్కెట్లోకి వచ్చింది.

మీరు ఇప్పటివరకు చూసిన అన్ని ఎలక్ట్రిక్ బైక్‌లు , స్కూటర్లు లిథియం-అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. అయితే ఒక చైనీస్ కంపెనీ సాల్ట్-అయాన్ బ్యాటరీలను తయారు చేసింది. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తున్నారు.మీరు ఇప్పటివరకు చూసిన అన్ని ఎలక్ట్రిక్ బైక్‌లు , స్కూటర్లు లిథియం-అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. అయితే ఒక చైనీస్ కంపెనీ సాల్ట్-అయాన్ బ్యాటరీలను తయారు చేసింది. వీటిని ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తున్నారు

దీని ప్రకారం ఒక చైనీస్ కంపెనీ ఈ టెక్నాలజీ ఆధారంగా మూడు వేర్వేరు మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వాటి ధరలు $400 నుండి $660 (సుమారు రూ. 35 వేల నుండి 51 వేల వరకు) వరకు ఉన్నాయి. వాటి ట్రయల్ రన్‌లు కూడా నిర్వహించబడ్డాయి.దీని ప్రకారం ఒక చైనీస్ కంపెనీ ఈ టెక్నాలజీ ఆధారంగా మూడు వేర్వేరు మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వాటి ధరలు $400 నుండి $660 (సుమారు రూ. 35 వేల నుండి 51 వేల వరకు) వరకు ఉన్నాయి. వాటి ట్రయల్ రన్‌లు కూడా నిర్వహించబడ్డాయి చైనాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు యాడియా , TAILG సోడియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించే ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేశాయి. ఈ బ్యాటరీలు చౌకైనవి, సురక్షితమైనవి. లిథియం-అయాన్ బ్యాటరీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మెరుగ్గా పనిచేస్తాయి. దీని ప్రకారం చూసుకుంటే సాల్ట్-అయాన్ బ్యాటరీలపై ఆధారపడిన వాహనాలను కేవలం 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

చైనాలోని హాంగ్‌జౌలోని ఒక షాపింగ్ మాల్ ముందు ఈ స్కూటర్ల లైవ్ టెస్ట్ డ్రైవ్‌ను కూడా నిర్వహించారు. ఈ సమయంలో, ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. దీనిలో బ్యాటరీ 15 నిమిషాల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది.ఈ విధంగా, ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత, ఈ బైక్‌లు దాదాపు 50-100 కి.మీ (మోడల్‌ను బట్టి) దూరాన్ని కవర్ చేయగలవు. దీని ప్రకారం, వాటి వేగం సాధారణంగా గంటకు 30-50 కి.మీ వరకు ఉంటుంది చైనా వస్తువులకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. మొబైల్, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ విధంగానే ఈ ఎలక్ట్రిక్ కారులు కూడా ఇండియా మార్కెట్లోకి వస్తే హాట్ కేసుల్లా సేల్ అవుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.చైనా వస్తువులకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. మొబైల్, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ విధంగానే ఈ ఎలక్ట్రిక్ కారులు కూడా ఇండియా మార్కెట్లోకి వస్తే హాట్ కేసుల్లా సేల్ అవుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *